Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ ఓడిపోతాడని భారీ బెట్టింగులు... రాసిపెట్టుకోండంటున్న థర్టీ ఇయర్స్ పృధ్వీ

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల మాట ఎలా వున్నా ఏపీ అసెంబ్లీ ఫలితాల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. కొందరు నాయకులైతే తమకు ఓటింగ్ ఎలా వున్నదని సర్వేలు చేసుకుంటున్నారు. ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలను చూసి షాక్ తినేవారు కొందరైతే... ఉబ్బితబ్బిబ్బవుతున్నవారు మరికొందరు. అసలు లెక్క తేలేందుకు మరో 41 రోజుల వ్యవధి వున్నది. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీ నాయకుడు, నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ మాటల తూటాలు పేల్చుతున్నారు.
 
వచ్చే ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వంలోని 18 మంది మంత్రులు ఘోర పరాజయం చవిచూడబోతున్నారని జోస్యం చెప్పారు. అంతేకాదు... నారా లోకేష్ కనీసం 8 వేల ఓట్ల పైచిలుకు తేడాతో పరాజయం చవిచూడబోతున్నారంటూ చెప్పారు. మా పార్టీకి చెందిన రియల్ హీరో ఆర్కేకె ప్రజలు భారీగా ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని ప్రజల వద్దకెళ్లి అసలు సంగతి తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. అక్కడి ప్రజలు చంద్రబాబు పాలన మాట ఎలా వున్నా తాము మాత్రం జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేశామని చెప్పారని వెల్లడించారు.
 
ఈ విషయం తెలిసే తెదేపా నాయకుల ముఖాలు నల్లగా మాడిపోయి, వాడిపోయి కనిపిస్తున్నాయని సెటైర్లు వేస్తున్నారు. ఇక చేసింది చాలు... వారంతా వెళ్లి హాయిగా ప్రకృతి వైద్యశాలల్లో సేద తీరవచ్చంటూ సలహా ఇస్తున్నారు. మరోవైపు మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారంటూ భారీ బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది తేలాల్సి వుంది. మరి అసలు రిజల్ట్ ఏమిటన్నది తేలాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments