ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ - హైదరాబాద్ - కేరళ యూనివర్శిటీల్లో ప్రదర్శన

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (15:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు సిరీస్ డాక్యుమెంటరీలను బీబీసీ ప్రసారం చేసింది. అయితే, వీటిని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా పలు రకాలైన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొన్ని అనుబంధ విభాగాలు ప్రదర్శించాయి. 
 
ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేశారు. ఆ తర్వాత వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కేరళలోని పలు ప్రాంతాల్లో ఈ డూక్యుమెంటరీని ప్రదర్శించారు.
 
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లను ఇతివృత్తంగా చేసుకుని బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. దాన్ని బీబీసీ రెండు భాగాల సిరీస్‌గా ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆగ్రహావేశాలు రేకెత్తించింది. బీజేపీతో దాని అనుబంధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఎంపిక చేసిన ఫ్లాట్‌ఫారమ్‌లపై ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా కేంద్రం నిషేధించింది. 
 
అదేసమయంలో ఈ డాక్యుమెంటరీపై స్పందించేందుకు అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ముందుకురాలేదు. ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్‌ను తగ్గించడానికి బీబీసీ కుట్రపూరితంగా దీన్ని తయారు చేసిందని భారత మూలాలు ఉన్న ప్రవాసభారతీయులతో పాటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Vijay Deverakonda: హైదరాబాద్ వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments