Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... బాలాపూర్ లడ్డును అంత పెట్టి కొన్నారా?

సాధారణంగా వినాయకునికి నైవేద్యంగా సమర్పించే లడ్డును చివరి రోజున వేలంపాటలో విక్రయించడం, దాన్ని కొనడానికి భక్తులు పోటీపడటం తెలిసిందే. అయితే ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై ఈ ఏడాదికి 25 ఏళ్లు ముగిసింది. అంటే సిల్వర్ జూబ్లీ సం

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:42 IST)
సాధారణంగా వినాయకునికి నైవేద్యంగా సమర్పించే లడ్డును చివరి రోజున వేలంపాటలో విక్రయించడం, దాన్ని కొనడానికి భక్తులు పోటీపడటం తెలిసిందే. అయితే ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై ఈ ఏడాదికి 25 ఏళ్లు ముగిసింది. అంటే సిల్వర్ జూబ్లీ సంవత్సరం అన్నమాట. ఈ లడ్డూను స్వంతం చేసుకున్నవారు దీనిని తమ పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం ఉండటం వలన ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా లడ్డు వేలం జరుగుతుంటుంది. 
 
మొదట్లో స్థానికులు మాత్రమే ఇందులో పాల్గొనేవారు. తర్వాత్తర్వాత బయటివారికి కూడా ఈ అవకాశం కల్పించడం మొదలైంది. 1994లో మొదటిసారిగా ఈ సాంప్రదాయం మొదలైనప్పుడు ఇది 450 రూపాయల ధర పలికింది, తర్వాతి సంవత్సరమే పదింతలు పెరిగి దీని ధర 4500 రూపాయలు పలికింది. అలా ఒక్కో ఏడాది భారీ స్థాయిలో ధర పెరుగుతూ ఇప్పటికి లక్షల స్థాయికి చేరుకుంది.
 
కాగా ఈ ఏడాది కూడా చాలా తీవ్రమైన పోటీ జరిగింది. చివరికి ఈ 21 కిలోల లడ్డూను బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు స్వంతం చేసుకున్నారు. గతేడాది నాగం తిరుపతి రెడ్డి దీనిని రూ.15.60 లక్షలు చెల్లించి దక్కించుకోగా, గతేడాదితో పోలిస్తే ఒక లక్ష ఎక్కువ పెట్టి మరీ స్వంతం చేసుకున్నారు శ్రీనివాస్ గుప్తా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments