అయోధ్య తీర్పు కోసం ఎదురు చూపులు...

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (09:43 IST)
అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వందేండ్లకుపైగా కొనసాగుతున్న ఈ వివాదంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో 46 రోజులపాటు రోజువారీ విచారణ జరిపింది. 
 
అన్ని పక్షాల వాదలను విన్న అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్టు గత నెల 16న ప్రకటించింది. ధర్మాసం ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడిస్తుందా? లేదా 4-1, 3-2 తేడాతో నిర్ణయం వెలువరిస్తుందా? అని ఆసక్తి నెలకొంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపనున్నది. 
 
ముఖ్యంగా వచ్చే తరాలపై తీర్పు ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లిం సంస్థల పెద్దలు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో తీర్పు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించకుండా.. కొన్నాళ్లపాటు ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచాలని కోరుతున్నారు. మొత్తంమీద అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు పట్ల దేశం యావత్తూ ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments