వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమం.. ఎయిమ్స్ హెల్త్ బులిటెన్

బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. జూన్ 11 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కురువృద్ధుడి ఆరోగ్యం క్షీణించి

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (11:26 IST)
బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. జూన్ 11 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కురువృద్ధుడి ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు ప్రకటన విడుదల చేయడంతో కాషాయదళంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అటల్ ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే ప్రముఖులు ఎయిమ్స్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. 
 
ప్రధాని మోదీ బుధవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి సుమారు గంటపాటు అక్కడే గడిపారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా గురువారం ఉదయం ఎయిమ్స్‌కి వెళ్లారు. తాజాగా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. 
 
కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాజ్ పేయి చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల చేరారు. ఆయన ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్‌కు చేరుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments