Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. వీరబాదుడు... ట్రక్కు డ్రైవర్‌కు దేశంలోనే అత్యధిక అపరాధం

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:17 IST)
దేశవ్యాప్తంగా కొత్త మోటారు వాహన చట్టం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా తనిఖీలు చేస్తూ వాహనచోదకులను బెంబేలెత్తిస్తున్నారు. పైగా, కొత్త చట్టం మేరకు అపరాధం రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే వాహనం ఖరీదు కంటే అధిక మొత్తంలో జరిమానా విధించిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు విధించిన అపరాధ రుసుం చెల్లించలేక వాహనాలను వదిలివేయడం లేదా కాల్చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
తాజాగా ఒడిషా రాష్ట్రంలోని సంబల్‌పూర్‌ జిల్లాలో అశోక్‌ జాదవ్‌ అనే ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు రూ.86,500 జరిమానా విధించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో పాటు పరిమితికి మించి లోడు తీసుకెళ్లడం, ఇతర ఉల్లంఘనల కారణంగా సెప్టెంబరు 3వ తేదీన ఈ జరిమానాను విధించారు. అంత కట్టలేనని డ్రైవర్‌ దాదాపు ఐదు గంటలు వేడుకోగా రూ.70,000కు తగ్గించారు. అయితే ఇప్పుడా చలానా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments