Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న సాక్షిగా దీక్ష .. టీడీపీ అంటే ఏంటో దేశానికి తెలియజేస్తాం : చంద్రబాబు

తిరుమల వెంకన్న సాక్షిగా ఈనెల 20వ తేదీన దీక్ష చేపట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో ఒక్క కేంద్రానికే కాదు దేశం యావత్‌కు

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (15:59 IST)
తిరుమల వెంకన్న సాక్షిగా ఈనెల 20వ తేదీన దీక్ష చేపట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో ఒక్క కేంద్రానికే కాదు దేశం యావత్‌కు తెలియజేస్తామని ఆయన అన్నారు.
 
అంబేద్కర్ 127వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష సాగుతుందన్నారు. 
 
పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరాహారదీక్ష చేశారని... పార్లమెంట్ జరగకపోవడానికి కారణం మీదే (బీజేపీ) కదా అని ఆయనను తాను అడుగున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని... తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. 
 
ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని... ఢిల్లీలో చక్రం తిప్పుతామని ఆయన జోస్యం చెప్పారు. 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే... ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పైగా, తన దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ దేశానికి చూపుదామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments