Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిలతీర్థంలో ఫోటోగ్రాఫర్ వెంటపడ్డ అమిత్ షా.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (20:19 IST)
కేంద్ర హోమంత్రి అమిత్ షా ఫోటోగ్రాఫర్ వెంట పడటమేంటి అనుకుంటున్నారా.. సాధారణంగా విఐపిల దగ్గరే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంటే తిరుగుతుంటారు. మూడురోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన అమిత్ షా తిరుగు ప్రయాణంలో తిరుపతిలోని కపిలతీర్థం ఆలయాన్ని దర్సించుకున్నారు. 

 
ఆలయం వద్ద టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు కేంద్రమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సంధర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతున్న యాగంలో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను టిటిడి ఉన్నతాధికారులు అందజేశారు. అలాగే కపిలేశ్వరస్వామి స్ధలపురాణాన్ని తెలిపే పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశారు. 

 
అయితే ఆలయం నుంచి బయటకు వెళ్ళే సమయంలో కపిలతీర్థంను చూసిన అమిత్ షా ఆశ్చర్యపోయారు. కొండల మధ్య నుంచి వచ్చే నీటిని చూసిన అమిత్ షా ఆలయం చుట్టుప్రక్కల వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా ఉండటంతో ఆనందానికి లోనయ్యారు. వెంటనే ఫోటోగ్రాఫర్ ఎక్కడా అంటూ గట్టిగా పిలిచారు.

 
అంతేకాదు ఫోటోగ్రాఫర్‌ను వెతికారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ఫోటోగ్రాఫర్‌ను పిలిచి ఫోటో తీయమన్నారు. నీళ్ళు రావడంతో పాటు కపిలేశ్వరస్వామి ఆలయం కనిపించాలంటూ అమిత్ షా చెప్పారు. ఫోటో కూడా టిటిడి ఫోటోగ్రాఫర్ అలాగే తీశారు. ఈ ఫోటోను తనకు పంపించాలని కోరారు కేంద్ర హోంమంత్రి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments