Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీఫ్ జస్టిస్ అభిశంసన : సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది.

Webdunia
మంగళవారం, 8 మే 2018 (12:04 IST)
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. తమ నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, పలువురు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మంగళవారం పిటినష్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం, దాన్ని తోసిపుచ్చింది.
 
నిబంధనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడిన అత్యున్నత ధర్మాసనం, పిటిషన్‌పై తదుపరి విచారణ ఉండబోదని తేల్చిచెప్పింది. ఈ విషయమై రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వినతినీ తోసిపుచ్చింది. విషయాన్ని పార్లమెంట్ వేదికగానే తేల్చుకోవాలని సూచించింది. మీకు మీరుగానే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని సూచన చేయగా, ఆపై తమ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ అభిశంసన తీర్మానం అశంలో కాంగ్రెస్ భంగపాటుకు గురైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments