Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలను కుక్కి... మహారాష్ట్రలో కరోనా మృత్యుక్రీడ

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:14 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ మృత్యుక్రీడ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఇప్పటికే రికార్డుకెక్కిన మహారాష్ట్ర మృతుల్లోనూ అదేపరిస్థితి కొనసాగుతోంది. దీనికి నిదర్శనమే పై ఫోటో. ఒక అంబులెన్స్‌లో మహా అయితే ఒకటి లేదు రెండు మృతదేహాలను తీసుకొస్తారు. కానీ, ఇక్కడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 కరోనా మృతదేహాలను ఒకే ఒక్క అంబులెన్సులో కుక్కి పంపించారు అధికారులు. అదేమని అడిగితే నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు తీసిన వారి బంధువుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగిచ్చారు. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో జరిగింది. దీనిపై అధికారులు స్పందించారు. అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఈ కరోనా మృతదేహాలను తీసుకెళ్లినట్టు చెప్పారు.
 
‘‘మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమసంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు మృతదేహాలను అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం’’ అని ఆసుపత్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర అన్నారు.
 
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిబా అదనపు కలెక్టర్‌ను ఆదేశించినట్టు బీద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర జగ్తప్ చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments