Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రసీమ 60 శాతం చచ్చిపోయింది... ఆర్టిస్టులు అడుక్కు తింటున్నారు... పోసాని

Webdunia
శుక్రవారం, 15 మే 2015 (21:43 IST)
తెలుగు చిత్రసీమ సగం చచ్చిపోయింది. కేరక్టర్ ఆర్టిస్టులు రోడ్లపై అడుక్కు తింటున్నారు. 250 సినిమాల స్థానంలో కేవలం 30 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. హీరోలు సినిమాల సంఖ్య పెంచకపోతే దారుణం పరిస్థితులు చోటుచేసుకుంటాయని రచయిత, సినీ నటుడు పోసాని మురళి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గురువారం రాత్రి జరిగిన 'జేమ్స్‌బాండ్' ఆడియో లాంచ్ ఫంక్షన్‌లో పోసాని మాట్లాడుతూ, ఒకప్పుడు ఏడాదికి దాదాపు 250 సినిమాలు చేసేవాళ్లు. సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 11 సినిమాల వరకు చేసేవారని గుర్తుచేశారు. కానీ హీరోగా వుండగానే ఆయన గౌరవంగా పక్కకు తప్పుకున్నారని, హీరోగానే మిగిలిపోయారని చెప్పారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎక్కవు సినిమాల్లో నటించినంత మాత్రనా హీరో దమ్ము పోదని అన్నారు. ఏడాదికి 30 నుంచి 40 సినిమాలే వస్తున్నాయి. సినిమాలు 60% పడిపోయాయి. పెద్ద హీరోలు చాలామంది ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెడుతున్నారు. 
 
చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు రోడ్డునపడి అడుక్కుంటున్నారు అని ఆవేదన వ్యక్తంచేశాడు. హీరోలు శ్రీకాంత్, నరేష్, నాని, సునీల్‌ల పేర్లు ప్రస్తావిస్తూ... మీరైనా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు తీసి సినిమా పరిశ్రమను బతికించాలని వేడుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments