Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమల కొండ కిట కిట..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. అలాంటిది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అంటే ఇక చెప్పనవసరం లేదు.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:51 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. అలాంటిది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అంటే ఇక చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంత జనం. ప్రతి గరుడ వాహనసేవకు లక్షలాదిమంది భక్తులు తిరుమల కొండపైకి తరలివస్తారు. మంగళవారం మధ్యాహ్నానికే రెండున్నర లక్షమంది ఉన్న తిరుమలలో ప్రస్తుతం మరో రెండున్నర లక్షల మందికి పెరిగి మొత్తం 5 లక్షల మందికి చేరుకుంది. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మంచిదన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమ్మకం కూడా. 
 
అందుకే ప్రతియేటా జరిగే గరుడ వాహనసేవకు అనూహ్యంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లోనూ అదే పరిస్థితి. జనం. జనం.. ఇసుకేస్తే రాలనంత జనం. భక్తులతో మొత్తం తిరుమల నిండిపోయింది. ఎక్కడా కాస్తంత జాగా కూడా లేదు. 
 
తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచే భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రి జరిగే గరుడ వాహనసేవకు ఇప్పటికే తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాత్రి 7.30 నిమిషాలకే గరుడ వాహన సేవను టిటిడి నిర్వహించనుంది. గ్యాలరీలన్నీ ఇప్పటికీ భక్తులతో నిండిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments