Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంత వాహనంపై ఊరేగిన బ్రహ్మాండ నాయకుడు

Webdunia
తిరుమల బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీమలయప్ప స్వామి హనుమంత వాహనంపై ఊరేగారు. శ్రీమహావిష్ణువు యొక్క శ్రీరాముని అవతారంలో ఆంజనేయుడు పరమభక్తుడు. ఏ అవతారంలోనైనా తన భక్తులను మర్చిపోలేదని చెప్పేందుకే కలియుగంలో వేంకటేశ్వరుడు హనుమంత వాహనంపై విహరించారన్నది భక్తుల విశ్వాసం. దేవదేవుడైన వెంకన్న కూడా భక్తులపై ఎల్లప్పుడూ కృపాకటాక్షాలు ఉంటాయనేందుకు నిదర్శనం ఉత్సవం ఊరేగింపు. ఈ సేవలోనూ లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి దివ్య అనుగ్రహాన్నిచూసి తరించారు.

భక్తునికి, భగవంతునికి కృపాకటాక్షాలుంటాయని చెప్పే దేవదేవుడు ఇవాళ హనుమంతవాహనంపై తిరుమల తిరు వీధుల్లో విహరించారు. యుగాలు మారినా, తరాలు మారినా ప్రియమైన తన భక్తులు మాత్రం ఎపుడూ తన వెంటే ఉంటారని చాటి చెబుతూ భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దేవునిగా ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు దర్శనమిచ్చాడు.

మలయప్ప స్వామిని ఈ సేవలో చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందు రోజు జరిగిన గరుడ సేవకు వచ్చిన భక్తులు తిరుమలలోనే ఉండిపోవడంతో వీరంతా హనుమంత వాహన సేవను కూడా తిలకించారు.
File
FILE

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments