Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణరథంపై ఊరేగిన శ్రీవారు

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2008 (19:33 IST)
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన సోమవారం తిరుమలేశుడు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగిన వైభవాన్ని భక్తకోటి తిలకించి ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. అశేషభక్తజన సందోహంతో కిక్కిరిసిన తిరుమల కొండ గోవింద నామస్మరణతో దద్ధరిల్లింది. సాంప్రదాయ బద్ధమైన కోలాటాలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ శ్రీవారు దివ్యపురుషుడుగా స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు.

ఇకపోతే... ఆరోరోజైన సోమవారం రాత్రి స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో విహరించి భక్తులను మురిపించనున్నారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ ఈ గజవాహన సేవ జరుగుతుందని శాస్త్రోక్తం.

ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేనని లోకానికి బోధించే రీతిలో భక్త జనులకు అభయమిస్తూ తిరుమాడ వీధుల్లో శ్రీవారు ఊరేగనున్నారు. భక్తజనుల మొరల్ని వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచేందుకు ఈ గజ వాహన సేవ జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం మలయప్ప స్వామి హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి

Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

Show comments