Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణరథంపై ఊరేగిన శ్రీవారు

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2008 (19:33 IST)
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన సోమవారం తిరుమలేశుడు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగిన వైభవాన్ని భక్తకోటి తిలకించి ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. అశేషభక్తజన సందోహంతో కిక్కిరిసిన తిరుమల కొండ గోవింద నామస్మరణతో దద్ధరిల్లింది. సాంప్రదాయ బద్ధమైన కోలాటాలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ శ్రీవారు దివ్యపురుషుడుగా స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు.

ఇకపోతే... ఆరోరోజైన సోమవారం రాత్రి స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో విహరించి భక్తులను మురిపించనున్నారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ ఈ గజవాహన సేవ జరుగుతుందని శాస్త్రోక్తం.

ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేనని లోకానికి బోధించే రీతిలో భక్త జనులకు అభయమిస్తూ తిరుమాడ వీధుల్లో శ్రీవారు ఊరేగనున్నారు. భక్తజనుల మొరల్ని వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచేందుకు ఈ గజ వాహన సేవ జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం మలయప్ప స్వామి హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments