Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి

Webdunia
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

జంతువులకు రాజైన సింహం సైతం తానేనని, మనుషులు తమలోని జంతు ప్రవృతిని అదుపు చేసుకోవాలనే సందేశాన్ని చాటిచెప్పే ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. అత్యంత సుందరంగా అలంకృతమై, సింహంపై గంభీరంగా నాలుగు మాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగిన వైనం భక్తులను కనువిందు చేసింది.

మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు దివ్య సుందరంగా ముత్యపుపందిరి వాహనంపై విహరించనున్నారు. సుకుమార సేవగా చెప్పబడే ముత్యపు పందిరి వాహనంలో మలయప్ప ఊరేగే అందాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఏడు కొండలకు తరలివస్తున్నారు.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments