Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్యపు పందిరి వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

Webdunia
వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం ముత్యపు పందిరి సేవ వైభవంగా జరుగనుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు.

ముత్యాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై అలంకారితుడైన మలయప్ప మాడవీధుల్లో విహరించే అందాన్ని తిలకించేందుకు భక్తకోటి పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు.

ఇకపోతే శుక్రవారం రాత్రి ఏడుగంటల నుంచి ఎనిమిది గంటల మధ్య శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న వాహనసేవలకు భక్తులు అశేష సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం వైభవంగా జరిగిన సింహవాహన సేవ భక్తులను పెద్ద ఎత్తున అలరించింది.

వాహన సేవను తిలకించేందుకు వచ్చిన భక్తుల రద్దీతో వాహనం ముందుకు కదలడానికి ఎక్కువ సమయం తీసుకుంది. తిరుమాడవీధులు గోవింద నామస్మరణలతో మారు మోగుతున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments