Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు: శోభాయమానంగా పుష్పప్రదర్శన

-పుత్తా యర్రం రెడ్డి, ఎమ్ఎస్, పీఆర్, సీనియర్ పాత్రికేయులు

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2011 (19:14 IST)
WD

ఒక చెట్టుకు ఓ పువ్వు పూస్తే, అదే పువ్వును పదేపదే చూస్తూ మురిసిపోతాం. ఆ అందాన్ని ఆస్వాదిస్తాం. ఇలాంటి పుష్పాలు ఒకటి కాదు రెండు కాదు వేలాదిగా ఒకే చోట దర్శనమిస్తే.... కనురెప్ప వాలనంటుంది, కాలు కదలనంటుంది. నిజంగా అలాంటి దృశ్యమాలిక లభిస్తే ఆహా... ఆ అందం చూడతరమా...! నిజమండీ బాబూ ఇలాంటి దృశ్యం మీకు తిరుమలలో కనువిందు చేస్తుంది. బ్రహ్మోత్సవాలలో ఆ పుష్ప పరిమళాల మైమరపింప జేస్తాయి. ఇంకెందుకాలస్యం తిరుమల బాట పడదాం రండీ.


WD

నయనానందకరం అనే పదానికి నిజంగా అక్కడే అర్థం లభిస్తుంది. కేవలం పుష్పప్రదర్శనను తిలకించడానికే జనం క్యూ కడతారు. ప్రపంచంలోనే అత్యంత అలంకారభూషితంగా కనిపించే దేవుళ్ళలో వెంకన్నను మించిన దేవుడు మరొకరు ఉండరు. అలంకరణ అంటే ఆయనకు అంతటి ప్రీతి మరి.


WD

అలంకార ప్రియుడికి వినియోగించే అన్ని రకాలు ఫలపుష్పాలను చూసే భాగ్యం మనకు కలిగితే... ఆ అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోలేం. టిటిడి ప్రతీ ఏటా బ్రహ్మోత్సవాలలో ఆ భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తుంది. భక్తిభావం, ఆధ్యాత్మికతలకు ఆధునికతను మేళవించి ఈ ప్రదర్శనను ఇచ్చే టిటిడి ఉద్యానవనశాఖకు నిజంగా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.


WD

పుష్పప్రదర్శన అంటే నాలుగు గులాబీలు, నాలుగు రోజాలు అలంకరించి ఉదయం నుంచి సాయంత్రానికి ముగింపు పలుకడం సహజం. అంతకుమించి వాటిలో తాజాదనాన్ని నింపడం ఎవరికైనా వల్లమాలిన పనే. కాని టీటీడీ కనీసం 10 రోజులపాటు కనువిందు చేసే రకరకాల పుష్పఫల ప్రదర్శనలను భక్తులకు అందిస్తుంది.


WD

వందకు పైగా రకరకాల పుప్పాలు, మొక్కలను ప్రదర్శనలో వినియోగిస్తారు. వీటిని తాజాగా ఉంచడానికి టీటీడీ ఉద్యానవన శాఖ ఎంతో శ్రమ తీసుకుంటుంది. ఈ పర్యాయం పాప వినాశనం దారిలో కొత్తగా నిర్మిస్తున్న కళ్యాణమండప స్థలంలోని ప్రదర్శన శ్రీవారి భక్తలను రా.. రమ్మని పిలస్తోంది. గత ఏడాది కంటే భిన్నమైన రీతిలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.


WD

సాధారణంగా స్వామి వారి అలంకరణకు ప్రతిరోజూ 1500 కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఇందులో సంపెంగలు మొదలకుని, సాంప్రదాయ పూలు, ఆధునిక రోజా జాతి పుష్పాల వరకూ అన్నింటికి స్థానం లభిస్తుంది. శ్రీవారి అలంకరణ చూడడానికి రెండు కళ్ళు చాలవు. అలంకరణలో టిటిడి అర్చకులు తీసుకునే మెళుకువలు నేటికీ రహస్యమే. మరెక్కడా ఇలాంటి అలంకరణ లభించదు. అలాంటి పుష్పాలను సమీపం నుంచి చూసి తరించే భాగ్యం పుష్ప ఫల ప్రదర్శన ద్వారానే లభిస్తుంది. టిటిడి ఈ పుష్పాలను దేశవిదేశాల నుంచి తెప్పిస్తుంది.


WD

పుష్పాలను ఎవరైనా తెప్పించుకోగలరు. కాని వాటిని ఏర్చి కూర్చడమే కళ. ఏదో ఫ్యాషన్‌ షోలా ఏర్పాటు చేయడానికి ఏమాత్రం కుదరదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పుష్పప్రదర్శన ఉండాలి. అంతేకాదు కనువిందు చేయాలి. అందులోనే అర్థం ఉండాలి. ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉద్యానవన శాఖ ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంది.


WD

పుష్పాలు, పత్రాలు, ఫలాలతోనే స్వామివారి దశావతారాలను ఏర్పాటు చేశారు. ఈ తీరు నయనానందకరం. అంతేనా ఏడుకొండలవాడి ఆలయంలోని ద్వార తీరును చక్కగా కనులకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. శ్రీమహావిష్ణువు పడక దృశ్యాన్ని పండించారు. ఎంతో కళాత్మకత, ఆధ్యాత్మికత, ఆధునికత కనిపించే ఈ ప్రదర్శన ఎంత చెప్పినా తక్కువే. వాటిని తిలకించాలంటే తిరుమలకు రావాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments