Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవదేవుని సన్నిధిలోనూ అంటరానితనం???

Webdunia
File
FILE
కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వరుని ఆలయంలోనూ అంటరాని తనం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ.. నమ్మితీరాల్సిందే. ఈ ఆలయంలో హరిజన, గిరిజన తెగల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చే వరకు ప్రవేశం కల్పించలేదు. కనీసం.. అలిపిరి దాటి తిరుమల సప్తగిరులు ఎక్కేందుకు సైతం వారు అనర్హులు. ఫలితంగా బ్రిటీష్ హయాంలో దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరించారు.

దీంతో వెంకన్నపై భక్తిభావం కలిగిన దళిత భక్తులు ప్రత్యామ్నాయంగా అలిపిరి సమీపంలోని అటవీప్రాంతంలో ఉన్న జలపాతం వద్ద తలవెంట్రుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకునేవారు. అందుకే ఈ జలపాతానికి మాలాడగుండం అని పేరువచ్చినట్టు పురాణాలు చెపుతున్నాయి.

అయితే, స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1944 సంవత్సరంలో మహాత్మా గాంధీ హరిజనోద్ధరణ ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో జాతిపిత తిరుపతికి వచ్చినపుడు ఈ విషయాన్ని పలువురు దళితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరజాతి బ్రిటిష్ అధికారులను కొండ ఎక్కనిచ్చి స్వజాతీయులైన దళితులను ఎందుకు ఎక్కనీయడం లేదని గాంధీ ప్రశ్నించారు.

నాటి నుంచి దళిత పోరాటాలు ఆరంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత తిరుపతి నుంచి తిరుమలకు దళితులకు ప్రవేశం కలిగింది. ప్రస్తుతం తితిదేలో వందలాది మంది దళిత ఉద్యోగులు తమ సేవలను అందిస్తూ భక్తుల సేవలో తరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

Donald Trump: యూఎస్ఏఐడీ సాయాన్ని 90 రోజులు నిలిపివేస్తాం.. డొనాల్డ్ ట్రంప్

నేనుండగా ఆ మహిళతో అక్రమ సంబంధమా? ప్రశ్నించిన భార్య.. చంపేసిన భర్త!

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభకు రానున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

అనగనగా ఉపాధ్యాయుడిగా సుమంత్‌

దిల్ రాజు ఆవిష్కరించిన బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ.. సాంగ్

మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లోనా? చేసే చేతల్లో నా? చెప్పేదే సారంగపాణి జాతకం

Show comments