Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవదేవుని సన్నిధిలోనూ అంటరానితనం???

Webdunia
File
FILE
కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వరుని ఆలయంలోనూ అంటరాని తనం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ.. నమ్మితీరాల్సిందే. ఈ ఆలయంలో హరిజన, గిరిజన తెగల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చే వరకు ప్రవేశం కల్పించలేదు. కనీసం.. అలిపిరి దాటి తిరుమల సప్తగిరులు ఎక్కేందుకు సైతం వారు అనర్హులు. ఫలితంగా బ్రిటీష్ హయాంలో దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరించారు.

దీంతో వెంకన్నపై భక్తిభావం కలిగిన దళిత భక్తులు ప్రత్యామ్నాయంగా అలిపిరి సమీపంలోని అటవీప్రాంతంలో ఉన్న జలపాతం వద్ద తలవెంట్రుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకునేవారు. అందుకే ఈ జలపాతానికి మాలాడగుండం అని పేరువచ్చినట్టు పురాణాలు చెపుతున్నాయి.

అయితే, స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1944 సంవత్సరంలో మహాత్మా గాంధీ హరిజనోద్ధరణ ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో జాతిపిత తిరుపతికి వచ్చినపుడు ఈ విషయాన్ని పలువురు దళితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరజాతి బ్రిటిష్ అధికారులను కొండ ఎక్కనిచ్చి స్వజాతీయులైన దళితులను ఎందుకు ఎక్కనీయడం లేదని గాంధీ ప్రశ్నించారు.

నాటి నుంచి దళిత పోరాటాలు ఆరంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత తిరుపతి నుంచి తిరుమలకు దళితులకు ప్రవేశం కలిగింది. ప్రస్తుతం తితిదేలో వందలాది మంది దళిత ఉద్యోగులు తమ సేవలను అందిస్తూ భక్తుల సేవలో తరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments