Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరిపై శ్రీవారు

Webdunia
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధమనోహర రూపంలో ఉభయ దేవేరులతో కలసి ముత్యపు పందిరిలో ఆశీనులై నాలుగు మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు కనువిందు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామికి జరిగే సుకుమార సేవ ముత్యపు పందిరి వాహనం. ముత్యాలతో రూపొందించిన పందిరి వాహనంలో తాండవ కృష్ణుని రూపంలోని స్వామివారిని ముచ్చటగా ఊరేగించారు.

తొలుత ఉత్సమూర్తులు రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో ఊయలపై సేద తీరారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో వైభవంగా ఊరేగారు.

ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. ఉత్సవ శోభల్లో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments