Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరిపై శ్రీవారు

Webdunia
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధమనోహర రూపంలో ఉభయ దేవేరులతో కలసి ముత్యపు పందిరిలో ఆశీనులై నాలుగు మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు కనువిందు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామికి జరిగే సుకుమార సేవ ముత్యపు పందిరి వాహనం. ముత్యాలతో రూపొందించిన పందిరి వాహనంలో తాండవ కృష్ణుని రూపంలోని స్వామివారిని ముచ్చటగా ఊరేగించారు.

తొలుత ఉత్సమూర్తులు రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో ఊయలపై సేద తీరారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేసి సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో వైభవంగా ఊరేగారు.

ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. ఉత్సవ శోభల్లో వివిధ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments