Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడసేవకు ఏడులక్షల మంది భక్తులు?

Webdunia
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడోత్సవంలో ఏడులక్షల మంది భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారని టీటీడీ అంచనా. అంగరంగ వైభవంగా జరిగిన గరుడసేవలో టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్త సందోహం తిరుమలకు చేరుకుంది.

కాలిబాట గుండా గరుడోత్సవానికి జనప్రవాహం తండోపతండాలుగా తరలివచ్చారు. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక వంటి తదితర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గరుడ వాహనంపై అలంకృతమైన శ్రీవారు మండపం నుంచి బయటకు రాగానే భక్త జనావళి చేసిన గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారు మ్రోగింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేందుకు ఇంకా రెండు రోజులున్న నేపథ్యంలో...తిరుమలలో జరిగే వాహన సేవలను దర్శించి వెంకన్న నీరాజనాలను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యల కోసం పోలీసులు నిఘా నీడలోనే ఉన్నారు. ఎన్నడూలేని విధంగా ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమాడ వీధుల్లోకి అనుమతిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments