Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడసేవకు ఏడులక్షల మంది భక్తులు?

Webdunia
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడోత్సవంలో ఏడులక్షల మంది భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారని టీటీడీ అంచనా. అంగరంగ వైభవంగా జరిగిన గరుడసేవలో టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్త సందోహం తిరుమలకు చేరుకుంది.

కాలిబాట గుండా గరుడోత్సవానికి జనప్రవాహం తండోపతండాలుగా తరలివచ్చారు. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక వంటి తదితర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గరుడ వాహనంపై అలంకృతమైన శ్రీవారు మండపం నుంచి బయటకు రాగానే భక్త జనావళి చేసిన గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారు మ్రోగింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేందుకు ఇంకా రెండు రోజులున్న నేపథ్యంలో...తిరుమలలో జరిగే వాహన సేవలను దర్శించి వెంకన్న నీరాజనాలను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యల కోసం పోలీసులు నిఘా నీడలోనే ఉన్నారు. ఎన్నడూలేని విధంగా ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమాడ వీధుల్లోకి అనుమతిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

Show comments