Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి

Webdunia
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం మలయప్ప స్వామి కల్పవృక్షంపై ఊరేగారు. కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షంపై వెంకన్న ఊరేగుతూ... సకలజీవరాశులకు "నేనున్నానని" అభయమిస్తూ మాడవీధుల్లో భక్తులకు కనువిందు చేశారు. సర్వాలంకార భూషితుడైన తిరుమలేశుడు శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కల్పవృక్షంపై ఆసీనుడై విహరించిన వైనాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో తేలియాడారు.

ఇకపోతే... శనివారం రాత్రి సర్వభూపాల వాహన సేవ వైభవంగా జరుగనుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మొదటి స్నపన తిరుమంజన వేడుక ఘనంగా జరుగనుందని టీటీడీ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత మూడు రోజులుగా తిరుమల కొండ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతోంది. దసరా సెలవులు, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో... పెద్ద ఎత్తున వెంకన్న ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. భక్తులకు అసౌకర్యం కలుగనీయకుండా, సదుపాయాలను కల్పించేందుకు టీటీడీ ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments