Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుల పండుగగా శ్రీవారి రథోత్సవం

Webdunia
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన బుధవారం మహారథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామిని దివ్య స్వరూపుడిగా అలంకరించి మహారథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీవారు తన దేవేరులతో కళ్యాణ వేంకటేశ్వరుడిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. సుప్రభాత సేవల అనంతరం ఉభయ నాంచారీ సమేత మలయప్పను రథమంటపానికి వేంచేపు చేశారు.

బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన శ్రీవారి రథోత్సవం 3 గంటలపాటు ఘనంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన రథోత్సవంపై మలయప్ప స్వామి ఊరేగిన వైభవాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు.

ఇకపోతే... బుధవారం రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివారికి ఆలయ రంగనాయకుల మంటపంలో విశేష సమర్పణ గావించారు. అనంతరం ఊంజల్‌ మంటపానికి చేరుకున్న వెంకన్నకు కన్నుల పండుగగా ఊంజల్ సేవ జరిగింది.

ఊంజల్ సేవకు తర్వాత వాహన మంటపానికి చేరుకున్న బ్రహ్మాండనాయకుడిని అశ్వ వాహనంపై అధిరోహించి రాత్రి 9గంటల నుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అశ్వవాహనంపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఊరేగిన మలయప్ప స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. కొత్త పెళ్లి కొడుకువోలె అశ్వవాహనంపై మలయప్ప విహరించిన వైనాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో తేలియాడారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

Show comments