#HBDPawanKalyan 'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ ... ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది.. (Video)

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్'. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. లేకుంటే ఈ దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే, సెప్టెంబరు రెండో తేదీ పవర్ స్టార్ పుట్టినరోజు. ఈ జన్మదినవేడుకలను పవన్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. అదేసయంలో పవన్ ఫ్యాన్స్‌కు వకీల్ సాబ్ యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 
 
పవన్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో వేచిచూస్తున్న తరుణం రానే వచ్చింది. రెండేళ్ళ త‌ర్వాత న‌టిస్తున్న 'వ‌కీల్ సాబ్‌'కి మూవీకి సంబంధించిన మోష‌న్ పోస్ట‌రను చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ విడుదల చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. లాయర్‌గా ప‌వ‌న్ అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన పోస్ట‌ర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది.
 
కాగా, బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్‌గా రూపొందుతున్న 'వకీల్ సాబ్' సినిమా డ్రామా ఎంటర్‌టైనర్. ఇందులో పవన్ కళ్యాణ్, నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు.
 
తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ జాతీయ స్థాయిలో హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ నుంచి అజిత్, విజయ్ ఫ్యాన్స్ క్లబ్‌లు సైతం ఈ ట్రెండ్‌లో పాల్గొనడం విశేషం.
 




 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments