''ఏ మంత్రం వేసావే'' రివ్యూ: అర్జున్ రెడ్డికి అవసరమా?

కథ గురించి పట్టించుకోకుండా అర్జున్ రెడ్డి నటించిన సినిమా ఏ మంత్రం వేసావే. ఇందులో అర్జున్ రెడ్డి నటన, ఆహార్యం, భాష్యం చిత్రవిచిత్రంగా ఉంటాయి. క్యారెక్టర్‌లో క్లారిటీ లేదు. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (15:20 IST)
సినిమా పేరు: ఏ మంత్రం వేసావే
తారాగణం: విజయ్ దేవరకొండ, శివానీ సింగ్, ఆశీష్ రాజ్ తదితరులు. 
దర్శకత్వం: శ్రీధర్ మర్రి 
సంగీతం: అబ్బత్ సమత్ 
కెమెరా: శివారెడ్డి 
నిర్మాత: మల్కాపురం శివకుమార్ 
విడుదల తేదీ: 09-03-2018 
 
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ''ఏ మంత్రం వేసావే'' సినిమా శుక్రవారం విడుదలైంది. "అర్జున్ రెడ్డి"తో భారీ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ''ఏ మంత్రం వేసావే'' చిత్రంతో ఏమేరకు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడో వేచి చూడాలి. 
 
కథా సారాంశం 
ఫేస్‌బుక్‌లో పరిచయమైన రాగ్స్ (శివానీ సింగ్) కోసం గేమర్ కమ్ హ్యాకర్ అయిన నిక్కీ (విజయ్ దేవరకొండ) ఎలాంటి పోరాటం చేస్తాడు. తన చుట్టూ వున్న కుట్రల్ని ఎలా అధిగమించాడు. ఇంతకీ నిక్కీ చుట్టూ వల పన్నిన వాళ్లెవరు? నిక్కీ ద్వారా ఏం సాధించాలనుకున్నారు? చివరికి నిక్కీ ఇష్టపడిన రాగ్స్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు అనేదే కథ.
 
విశ్లేషణ: 
కథ గురించి పట్టించుకోకుండా అర్జున్ రెడ్డి నటించిన సినిమా ఏ మంత్రం వేసావే. ఇందులో అర్జున్ రెడ్డి నటన, ఆహార్యం, భాష్యం చిత్రవిచిత్రంగా ఉంటాయి. క్యారెక్టర్‌లో క్లారిటీ లేదు. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌కి ఒక మచ్చలా మిగిలిపోతుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ కూడా ఎక్స్‌ప్రెషన్స్ చూపించలేకపోయింది. సినిమా మొత్తం ప్రేక్షకులను చిరాకు తెప్పించింది. 
 
హీరో, హీరోయిన్స్ ఫ్రెండ్స్‌ను ప్రేక్షకులను భరించడం చాలా కష్టం. ఇక నెగటివ్ రోల్‌లో కనిపించిన కుర్రాడు పర్వాలేదనిపించాడు. సోషల్ మీడియాలో మనుషుల విలువ తగ్గిపోయిందనే సందేశాన్ని చెప్పడం బాగుందే కానీ కథకథనం ఎంచుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 
 
శ్రీధర్ మర్రి "ఏ మంత్రం వేసావే" చిత్రంతో ప్రేక్షకులకు చుక్కలు చూపించాడు. ఇక మిగతా సాంకేతిక నిపుణులు కూడా ఆశించినంత వరకు రాణించలేకపోయారు. మొత్తానికి ఏ మంత్రం వేసావే చూసేందుకు బదులు ప్రేక్షకులు అర్జున్ రెడ్డిని ఇంకోసారి చూసేస్తే బెటర్.
 
రేటింగ్: 1/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు

Exit polls, జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే

ఐఏఎస్ అధికారిణికి తప్పని వేధింపులు - ఐఏఎస్ భర్తపై ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments