Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

OTTలో దృశ్యం-2.. వీకెండ్ థ్రిల్లర్ మూవీ.. రివ్యూ రిపోర్ట్

OTTలో దృశ్యం-2.. వీకెండ్ థ్రిల్లర్ మూవీ.. రివ్యూ రిపోర్ట్
, గురువారం, 25 నవంబరు 2021 (11:42 IST)
దృశ్యం-2 ఓటీటీలోనూ విడుదలైంది. 2014లో విడుదలైన దృశ్యంకు ఇది కొనసాగింపు. మాతృకలో మోహన్ లాల్ భార్యగా నటించిన మీనా, తెలుగు రీమేక్‌లో వెంకీకి భార్యగా నటించారు. అదే కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘దృశ్యం’ సీక్వెల్ ఈ యేడాది ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చింది. ఇప్పుడు ఆ సీక్వెల్ నూ తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేశారు. అదిప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
 
కథలోకి వెళితే... ఆరేళ్ల క్రితం దృశ్యం ఎక్కడ ఆగిందో.. ఈ సీక్వెల్‌ను దర్శకుడు జీతూ జోసఫ్ అక్కడే మొదలు పెట్టారు. తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్‌ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ సినిమా ముగుస్తుంది. వరుణ్‌ శవం దొరక్కపోవడం, అతను హత్యకు గురైన రోజున రాంబాబు తన కుటుంబం ఊర్లోనే లేదని ఆధారాలు సృష్టించడంతో పోలీసులు కేసును క్లోజ్ చేస్తారు.
 
అయితే. ఉద్యోగ విరమణ అనంతరం అమెరికాకు వెళ్ళిన వరుణ్ తల్లి గీత (నదియా) ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలనే పంతంతో ఉంటుంది. పేరుకు కేసును క్లోజ్ చేసినా, ఆమె స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు (సంపత్ రాజ్) సాయంతో రాంబాబుపై నిఘా పెడుతుంది. ఆరేళ్ళ తర్వాత తిరిగి పోలీసులు సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా దాని నుండి బయట పడ్డాడు అనేదే ‘దృశ్యం -2’ కథ.
 
‘దృశ్యం’ చిత్రంలో కేబుల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న రాంబాబు. ఇప్పుడీ సీక్వెల్‌లో థియేటర్‌ ఓనర్‌. తన భార్య జ్యోతి (మీనా) పేరుతోనే ఓ థియేటర్‌నూ నిర్వహిస్తుంటాడు. మొదటి భాగంలో సినిమాల పిచ్చి ఉన్న ఆ రాంబాబు, ఇప్పుడు సినిమా స్టోరీ రైటర్‌గా మారిపోతాడు. అయితే భర్తను సినిమా నిర్మాణమనే రొంపిలోకి దిగవద్దని, పెద్ద కూతురు అంజు (కృతిక) పెళ్ళి చేయమని జ్యోతి పోరుపెడుతూ ఉంటుంది. 
 
ఇదే సమయంలో వీరిద్దరి చిన్నకూతురు అను మీద కూడా పోలీసులు నిఘా పెడతారు. ఊర్లో వారంతా రాంబాబే వరుణ్‌‌ను హత్య చేశాడని నమ్ముతూ ఉంటారు. ఆరేళ్ళు గడిచినా ఆ విషయాన్ని మాట్లాడుకుంటూనే ఉంటారు. మారిన పోలీసు అధికారులు, అందివచ్చిన సరికొత్త సాంకేతికతతో రాంబాబు ఫ్యామిలీని ఎలా ట్రాప్ చేశారు? అతన్ని ఎలా ఉచ్చులోకి లాగారు? దాని నుండి రాంబాబు ఎలా బయటపడ్డాడనే అంశాలను జీతూ జోసఫ్ మొదటి చిత్రం కంటే ఆసక్తికరంగా ఈ సీక్వెల్‌లో చూపించాడు.  
 
సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ పకడ్బందీగా సీన్స్ రాసుకుని, ఆసక్తికరంగా దానిని తెరకెక్కించడంలో జీతూ జోసఫ్‌ సక్సెస్ అయ్యాడు. ఆరంభంలో కాస్తంత బోర్‌ కొట్టినా, పోలీసులు రాంబాబు కుటుంబాన్ని ఎలా ట్రాప్ చేశారనే విషయాన్ని రివీల్ చేసిన దగ్గర నుండి కథ చకచకా సాగిపోయింది. 
 
నటీనటుల విషయానికి వస్తే వెంకటేశ్ మరోసారి రాంబాబు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. నిజానికి ‘దృశ్యం’లో కంటే ఈ సీక్వెల్‌లో చాలా చక్కని పాత్రను పోషించాడు. అలానే దృశ్యం రీమేక్‌ను అప్పట్లో నటి సుప్రియ డైరెక్ట్ చేయగా, ఇప్పుడీ సీక్వెల్ రీమేక్‌ను మాతృకను తెరకెక్కించిన జీతూ జోసఫ్ డైరెక్ట్ చేయడం మరో కారణం కావచ్చు. మీనా నటన బాగుంది. కానీ ఆమెకు డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. ఇక వారి పిల్లలుగా నటించిన కృతిక, ఎస్తర్‌ అనిల్‌కు ఇందులో నటనకు పెద్దంత స్కోప్‌ లేకపోయింది. 
 
సినీ నటులందరి నుండి దర్శకుడు జీతూ చక్కని నటన రాబట్టుకున్నాడు. దృశ్యం మొదటి భాగంతో పోల్చితే సీక్వెల్ బెటర్ మూవీ. అలానే ఈ మూవీ ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం ఉత్కంఠభరితంగా సాగింది. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఎంచక్కా ఈ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కేజీఎఫ్‌' 2 దర్శక నిర్మాతలకు అమీర్ ఖాన్ క్షమాపణలు