సెన్సార్ నుంచి బయటపడ్డ డిగ్రీ కాలేజ్

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (19:51 IST)
అవార్డు చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డిగ్రీ కాలేజ్. తన పంధాకు భిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్య రావు హీరోహీరోయిన్లుగా శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
 
అతిధిగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ట్రైలర్‌ని విడుదల చేసి... చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ... ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యధార్థ‌ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసాం. ఆ అబ్బాయి, అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో ఆ అంశాలనే ఇందులో చూపించాం. ఆమధ్య విడుదల చేసిన ఈ చిత్రం మొదటి ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయి. 
 
అదే సమయంలో ట్రైలర్‌ని చూసిన కొంతమంది ఈ చిత్రానికి సెన్సార్ ఎలా వస్తుందో చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు. కానీ సెన్సార్ నిబంధనల ప్రకారంగా ఇస్తారు. చాలా రోజులు సెన్సార్లోనే ఈ చిత్రం ఉండిపోయింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సెన్సార్ పరంగా సమస్య ఎదురు కావడంతో రీవైసింగ్ కమిటీకి ఈ చిత్రాన్ని పంపడం జరిగింది.

కేవలం రెండు దృశ్యాలను మాత్రమే కట్ చేసారు. ఇలాంటి కథను యధాతదంగా చూపించడానికి దైర్యం కావాలి అంటూ అందరూ ప్రశంసించారు. గతంలో నేను తీసిన సినిమాలకు అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి రివార్డులు వస్తాయి. డిసెంబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాము అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

కోనసీమపై దిష్టి కామెంట్లు.. డిప్యూటీ సీఎంగా అనర్హుడు... ఆయన్ని తొలగించాలి.. నారాయణ

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments