ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాల తర్వాత మారుతీ తన శిష్యుడు ప్రభాకర రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమకథా చిత్రం'. కృష్ణ అల్లుడు సుధీర్ బాబు హీరోగా నటించాడు. నందిత హీరోయిన్. నిర్మాతల్లో మరొకరైన సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. సుధీర్బాబు అద్భుతంగా నటించాడు.
సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. జూన్ 7న విడుదల చేస్తున్నాం. ఆడియో ఇప్పటికే ఆదరణ పొందింది. ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం పర్యవేక్షణతోపాటు సమర్పకునిగా కూడా మారుతి బాధ్యలు నిర్వహించారు. వేసవిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని చెప్పారు.