సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

ఠాగూర్
ఆదివారం, 25 మే 2025 (13:43 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని వారెవరికీ కనీస కృతజ్ఞత లేదని, వారు ఇప్పటివరకు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలగలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు. అవసరమైన చోటు దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసరమైన సమస్యలను సృష్టించారని ఇపుడు అవి మరింత పెద్దవయ్యాయని అన్నారు. కామన్ సెన్స్ ఉపయోగించివుంటే ఉంటే ఆ సమస్యలు తలెత్తేవి కాదని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్
 
తెలుగు చిత్రపరిశ్రమపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై యేడాది గడిచినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం మర్యాదనిమిత్తం అయినా కలవకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి పట్ల కనీస మర్యాద లేదా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తెలుగు చిత్రపరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా  స్పందించారు. చిత్రపరిశ్రమలో అతంర్గత రాజకీయాలు, ఐక్యతా లోపంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్‌‍గా ఉంటాయి. అలాగే చాలా లోతుగా కూడా ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే, మన యానిటీ ఎలా ఉంది అనే ప్రశ్నించుకునే సమయం వచ్చింది అంటూ బన్నీ వాసు తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments