Webdunia - Bharat's app for daily news and videos

Install App

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

డీవీ
సోమవారం, 20 జనవరి 2025 (09:20 IST)
Helth camp poster
దివంగత కృష్ణంరాజు జయంతిని ప్రతి ఏటా జనవరి 20వ తేదీన జరుపుకుంటారు. ఆయన జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడు జనవరి 20 సోమవారంనాడు భారీ ఎత్తున భీమవరంలో హెల్త్ క్యాంప్ ను నిర్వహిస్తున్నారు. యు.కె. ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రముఖ డాక్టర్లు, రాజకీయనాయకులు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. క్రిష్ణంరాజుగారి భార్య ఉప్పల పాటి శ్యామలాదేవి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ వేడుకలో క్రిష్ణంరాజు కుమార్తెలు హాజరవుతున్నారు.
 
కాగా, ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు భీమవరంలో ప్రచారం జరుగుతోంది. వచ్చినా ఆయన కాసేపు వుండి వెంటనే వెళ్ళిపోతారని సమాచారం. హైదరాబాద్ లో ఫిలింసిటీలో రేపటినుంచి మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న రాజాసాబ్ షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. కనుక ఆయన భీమవరం రానున్నట్లు తెలుస్తోంది. క్రిష్ణంరాజు కుటుంబానికి ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో, పట్టణాల్లో మంచి పేరుంది. కేంద్ర మంత్రిగా కూడా వున్నారు. క్రిష్ణంరాజు స్వయంగా కామెర్లకు మందు కూడా వేసేవారు. కామెర్ల డాక్టర్ అని ఆయన్ను పిలుస్తుండేవారు. అందుకే భీమవరం చుట్టు పక్కల వారికి వైద్యసేవలు అందించేందుకు శ్యామాలాదేవి గారు నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments