చిరంజీవి కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్ ఎందుకు ఆగింది..?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (12:36 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగష్టు 22న ఆచార్య సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మోషన్ పోస్టర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆచార్య ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే ఆసక్తి మరింత పెరిగింది. అపజయం ఎరుగని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాని తెరకెక్కిస్తుండడంతో అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
 
మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే... పుట్టినరోజున ఆచార్య అప్డేట్‌తో పాటు కొత్త సినిమా ప్రకటన కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ... కొత్త సినిమా అప్డేట్ రాలేదు. చిరంజీవి మెహర్ రమేష్‌‌తో సినిమా చేయనున్నట్టు ఓ వార్త.. అలాగే డైనమిక్ డైరెక్టర్ వినాయక్‌తో ఓ సినిమా చేయనున్నట్టు మరో వార్త వినిపించింది.
 
వీటిలో ఏదో ఒక సినిమా గురించి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారనుకున్నారు కానీ... చేయలేదు. దీనికి కారణం ఏంటంటే... చిరంజీవి ఇప్పుడు ఆచార్య అప్డేట్ తప్ప మరో సినిమా గురించి ప్రకటన వద్దు అని చెప్పారట. ఆచార్య షూటింగ్ స్టార్ట్ అయి కంప్లీట్ అయిన తర్వాతే మరో సినిమా గురించి ఎనౌన్స్ చేద్దామన్నారని తెలిసింది. అయితే... వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ విషయమై కథా చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments