Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ తేజ్ తెచ్చిన‌ గుడ్ న్యూస్ ఏమిటి!

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (19:22 IST)
Sai Dharam Tej
ఇటీవ‌లే బైక్ ప్ర‌మాదానికి గుర‌యి కోమాలో కొంత‌కాలం వుండి కోలుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ అంటూ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఈ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, ఇంకా కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని వెల్లడించారు. వీడియో కాస్త నీర‌సంగా వున్నా కోలుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు.
 
అంత‌కుముందే కొన్ని ఫొటోలు పెట్టి అభిమానుల‌కు తెలియ‌జేశాడు. కానీ ఏవో అనుమాన‌లు కొంద‌రికి వ‌చ్చాయి. అందుకే వీడియో ద్వారా ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చాడు.  సెప్టెంబర్ నెల‌లో ప్ర‌మాదానికి గురైన సాయి ధరమ్  దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments