Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 28 ఏమిజరిగింది!

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (13:15 IST)
సినీ ర‌చ‌యిత‌ల సంఘం తొలి స‌భ్యుడు, ఆయుర్వేద డాక్ట‌ర్ ఏల్చూరి వార‌సుడు ఏల్చూరి రంజిత్ క‌థానాయ‌కుడిగా మారాడు. ఆయన న‌టిస్తున్న చిత్రం `ఏప్రిల్ 28 ఏమిజరిగింది`. శేర్రి అగర్వాల్  క‌థానాయిక‌. అజయ్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. వి జి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వీర స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర క‌థ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైల‌ర్  నారా రోహిత్ విడుదల చేశారు. 
 
హీరో క‌థ‌లో ర‌చ‌యిత‌. త‌ను రాసుకున్న క‌థ‌ను బ‌ట్టి ఓ భ‌వంతిలోకి వెళ్ళ‌గానే అక్క‌డ అత‌నికి జ్ఞాప‌కాలు గుర్తుకువ స్తాయి. అవి ఏమిట‌నేది చిత్రంలో చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈనెల‌లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి ప‌రుచూరి గోపాల‌కృష్ణ, హీరో శ్రీ‌విష్ణులు యూట్యూబ్ వీడియో మాట్లాడుతూ.. ఏల్చూరి వార‌సుడు తీసిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని ఆకాంక్షించారు. 
 
రామానాయుడు స్టూడియోలో ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం నారా రోహిత్ మాట్లాడుతూ.. రంజిత్ నాకు మంచి స్నేహితుడు. హీరోగా మంచి సినిమాలో తెలుగులో ఆరంభించారు. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ వుంటుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.
 
రంజిత్ మాట్లాడుతూ... అవ‌ధి అనే క‌న్న‌డ సినిమా చేశాను. ఆ త‌ర్వాత గ్యాప్ వ‌చ్చింది. ఇది 2వ సినిమా. తెలుగులో మొద‌టి సినిమా. నిర్మాత సినిమా ముందుకురావ‌డానికి స‌హ‌క‌రించారు. ఈ చిత్ర క‌థ చాలా భిన్నంగా వుంటుంది. గ‌తంలో వ‌చ్చిన థ్రిల్ల‌ర్‌ల కంటే ఆస‌క్తిక‌రంగా వుంటుంది. ద‌ర్శ‌క‌ుడు మ‌లిచిన తీరు అద్భుతంగా వుంది. ఈ జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments