Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనపు బొమ్మా? కాజల్ అగర్వాలా? ఎవరు నిజం?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:40 IST)
కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ
హీరోయిన్లకు ఆలయాలు కట్టడం మామూలే. గతంలో ఖుష్బూకు తమిళనాడులో ఆలయాలు కట్టారు. మరికొందరికీ ఆలయాలను కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. అయితే తాజాగా ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు మైనపు బొమ్మతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేశారు. అచ్చం కాజల్‌లా ఉన్న ఈ విగ్రహం పక్కన నిల్చుని అమ్మడు ఫోటోలకు ఫోజులిచ్చింది.
 
ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోయిన్ కాజల్ మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు. సింగపూర్‌లో గల మ్యూజియంలో ఏర్పాటు చేసిన తన మైనపు విగ్రహం పక్కన ఫోజిస్తూ నవ్వులు చిందించింది కాజల్. టాలీవుడ్ నుండి ఈ అర్హత సాధించిన హీరోయిన్‌గా కాజల్ గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగు హీరోలలో ప్రభాస్, మహేష్ ఈ అర్హత సాధించారు. 
కాజల్ అగర్వాల్
బాలీవుడ్ నుండి అమితాబ్, హృతిక్, కాజోల్, ఐశ్వర్యా రాయ్, షారుక్, కరీనా కపూర్, అనిల్ కపూర్ ఇలా చాలామంది సెలెబ్రిటీల మైనపు విగ్రహాలు ఈ మ్యూజియం నందు ఏర్పాటు చేశారు కూడా. ఇక ప్రస్తుతం కాజల్ తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో చేస్తున్న భారతీయుడు 2 సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా చేస్తున్నారు. అవకాశాలు తగ్గినా సరే కాజల్‌కు మాత్రం అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments