Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ల్గారిటీలేని వ‌ర్జిన్ స్టోరీ - నిర్మాత లగడపాటి శ్రీధర్

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (17:06 IST)
Lagadapati Sridhar
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై స్టైల్, స్నేహగీతం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత లగడపాటి శ్రీధర్. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. "వర్జిన్ స్టోరి" సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత లగడపాటి శ్రీధర్ ప్రెస్ మీట్ లో తెలియజేశారు.
 
- తెలుగులో యూత్ సినిమాలు అని చెబుతుంటారు గానీ అలాంటి సినిమాలు మన దగ్గర రావు. యూత్ సినిమా అంటే టీనేజ్ కథలు చూపించకుండా పెద్దవాళ్లు లవ్ స్టోరీలు చూపిస్తారు. 
 
- 16 ఏళ్ల యువతీ యువకుల మనోభావాలను తెరకెక్కించే చిత్రాలు మన దగ్గర రాలేదు. "వర్జిన్ స్టోరి"లో ఆ ప్రయత్నం చేస్తున్నాం. యుక్తవయసులో ఉండే అమ్మాయి, అబ్బాయి జీవితంలో ఒక రొమాన్స్ మొదలవుతుంది. 
 
- మనం నిజంగా ప్రేమించిన వ్యక్తి సన్నిహితంగా ఉన్నప్పుడు మనసు, శరీరం నిజాయితీగా స్పందిస్తాయి. ప్రేమ లేని వాళ్ల దగ్గర ఆ ఫీలింగ్ రాదు. యువత అలాంటి జతను ఎంచుకోండని చెప్పే చిత్రమిది. మీకు నిజంగా ఫీలింగ్ లేనప్పుడు ప్రేమించి వృథా. యువత జీవితంలో రొమాన్స్ ఉండాలి. 
 
- స్టైల్ సినిమా కథ విని వెంటనే షూట్ కు వెళ్లండి అని చెప్పాను. అలా బౌండ్ స్క్రిప్టుతో వచ్చిన సినిమా ఇది. వెంటనే ఓకే చెప్పాను. టీనేజ్ వాళ్లకే కాదు అలాంటి మనసున్న పెద్ద వాళ్లకూ "వర్జిన్ స్టోరి" నచ్చుతుంది. పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనుకున్న పెద్ద వాళ్లు మా సినిమా చూడొచ్చు. 
 
- విక్రమ్ సహిదేవ్ మా అబ్బాయి అని సినిమా చేయడం కాదు. అతనిలో నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ఆసక్తి ఉంది. తను బయట క్రేజీ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు సినిమాల పరిస్థితి సందిగ్ధంగా ఉంది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మా చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి అప్పుడు విక్రమ్ నెక్ట్ సినిమా గురించి ప్లాన్ చేస్తాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments