Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిజిస్టర్ పెళ్లి.. రహస్యంగా కాపురం.. అత్తింటివారి వేధింపుల వల్లే... (video)

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (10:43 IST)
తమిళ బుల్లితెరకు చెందిన వీజే చిత్ర గత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. చెన్నై నగర శివారు ప్రాంతంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో ఆమె వెంట కాబోయే భర్త హేమనాథ్ కూడా ఉన్నారు. బుల్లితెరపై ఎంతో పాపులర్ నటిగా గుర్తింపు పొందిన చిత్ర ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు.. చిత్ర ప్రియుడు హేమనాథ్‌ను అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారణ జరిపారు. అంతేకాకుండా, చిత్ర మృతదేహానికి జరిగిన శవపరీక్షలో కూడా మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదనీ, ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయినట్టు తేల్చారు.
 
అంటే, గురువారం ఉదయం జరిగిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం ఆమె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పిమ్మట కోట్టూరుపురంలోని తండ్రి కామరాజ్‌ నివాసం వద్ద చిత్ర అంత్యక్రియలు జరిగాయి.
 
అయితే, తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఆత్మహత్యకు వేధింపులే కారణం అని ఆరోపిస్తున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని తల్లి బోరున విలపిస్తూ చెప్పింది. తన కుమార్తె రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకుని హేమనాథ్‌తో రహస్యంగా కాపురం చేసిందన్నారు. 
 
అత్తింటివారు వేధించడం వల్లనో, హేమనాథ్‌ పెట్టిన మానసిక వేధింపుల కారణంగానో చిత్ర ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులకు తాను ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇక చిత్రతో పాటు టీవీ సీరియల్స్‌లో నటించిన నటీనటులు చిత్ర చాలా ధైర్యస్థురాలని, ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణాలు వుండవచ్చని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments