Webdunia - Bharat's app for daily news and videos

Install App

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

డీవీ
శనివారం, 14 డిశెంబరు 2024 (15:34 IST)
Vishnu Manchu, Will Smith
నటుడు, నిర్మాత విష్ణు మంచు నేతృత్వంలోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్ ఫండ్ అయిన తరంగ వెంచర్స్‌లోకి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు విల్ స్మిత్‌ని కీలక భాగస్వామిగా చేరడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. $50 మిలియన్ల ఫండ్, మరో $50 మిలియన్ల పొటెన్షియల్ ఎక్స్ టెన్షన్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నారు. మీడియా, వినోద రంగంలో ఆవిష్కరణలను పెంచడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది.
 
మారుతున్న సాంకేతికతలు, OTT ప్లాట్‌ఫారమ్‌లు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్‌చెయిన్, AR, VR, AI వంటి అధునాతన సాంకేతికత వంటి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. ఇది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో మద్దతు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తుంది.
 
ఈ తరంగ వెంచర్స్‌లో భారతీయ నటుడు, నిర్మాత, వ్యవస్థాపకుడు మంచు విష్ణు, దశాబ్దాల అనుభవం ఉన్న ఆర్థిక నిపుణురాలు అదిశ్రీ, రియల్ ఎస్టేట్ అండ్ పెన్షన్ ఫండ్స్‌లో కెనడియన్ పెట్టుబడిదారు ప్రద్యుమన్ ఝలా, భారతీయ మీడియాలో అనుభవజ్ఞుడైన వినయ్ మహేశ్వరి, హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్,  పెట్టుబడిదారుల సంబంధాలు మరియు ఫండ్ కార్యకలాపాలలో నిపుణులైన దేవేష్ చావ్లా, సతీష్ కటారియా భాగస్వాములుగా ఉండనున్నారు.
 
భారతదేశం, డెలావేర్‌లో రిజిస్టర్ చేయబడిన ఈ ఫండ్ వినోద పరిశ్రమలో స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతును మాత్రమే కాకుండా వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది. ‘ఈ ఫండ్ మీడియా, వినోదం భవిష్యత్తును పునర్నిర్మించడానికి ఒక ముఖ్యమైన అడుగు’ అని విష్ణు మంచు చెప్పారు. సృజనాత్మకతను సాంకేతికతతో కలపడమే దీని ప్రాముఖ్యత అని చెప్పారు. వచ్చే వారం ప్రత్యేకమైన ఇన్వెస్టర్ బ్రీఫింగ్ ఫండ్ ప్రారంభానికి వేదికను ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments