Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్‌పై హత్యాబెదిరింపుల కేసు.. అభిమానులకు ఫోన్ నెంబరిచ్చి బెదిరించాడా?

నడిగర్ సంఘం ఎన్నికల నాటి నుంచి హీరో విశాల్‌ను కేసులు వెంటాడుతూనే వున్నాయి. తాజాగా నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని నిర్మాత, దర్శకుడు సురేశ్‌ కామాక్

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (18:29 IST)
నడిగర్ సంఘం ఎన్నికల నాటి నుంచి హీరో విశాల్‌ను కేసులు వెంటాడుతూనే వున్నాయి. తాజాగా నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని నిర్మాత, దర్శకుడు సురేశ్‌ కామాక్షి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇటీవల జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తాను విశాల్ వర్గానికి పోటీగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశానని.. అయితే విశాల్ అభిమానులు హత్యాబెదిరింపులకు పాల్పడ్డారని వడపళని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్‌ అభిమాన సంఘం అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న కమల్‌కన్నన్, మరో అభిమాని తనపై రౌడీయిజానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 
 
అయితే నటుడు విశాల్‌కు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవని సురేష్ తెలిపారు. కానీ నిర్మాతల సమస్యలపై గళమెత్తానని.. సోషల్ మీడియాలో నడిగర్ సంఘం, నిర్మాతల మండలి సమస్యలపై పోరాడకపోవటాన్ని ఎత్తిచూపానని సురేశ్‌ కామాక్షి అన్నారు. దీంతో విశాల్‌ తన అభిమానులకు తన సెల్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి హాత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments