Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించిన వినరో భాగ్యము విష్ణు కథ యూనిట్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (16:11 IST)
Vinarao team at tirupati
వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి  అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న  థియేటర్స్ లో భారీగా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ప్రోమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా "వినరో భాగ్యము విష్ణు కథ" చిత్ర యూనిట్ తిరుమల శ్రీ వేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
 
ఈ సినిమా ఎక్కువ శాతం తిరుపతిలోనే జరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. సినిమా ప్రొమోషన్స్ మొదలు పెట్టినప్పటినుండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చిత్ర యూనిట్. కళా తపశ్వి కే విశ్వనాధ్ గారిచే "వాసవ సుహాస" పాటను లాంచ్ చేయడం. అలానే నిన్న జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో పన్నెండు తరాలకు సంబంధించిన  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించడం విశేషం. 
 
ఒకవైపు సామాన్య ప్రజలచే సాంగ్స్ లాంచ్ చేయించడంతో పాటు, మరోవైపు పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వాళ్ళతో కొన్ని పాటలను లాంచ్  చేయించడం ఈ చిత్ర యూనిట్ ప్రత్యేకత. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను,  GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments