Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీవితానికి ఆయన పొగడ్త చాలు.. : కంగనా రనౌత్

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:34 IST)
ఈ జీవితానికి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు, పొగడ్తలు చాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. తన జీవితానికి అది చాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. 'ఎమర్జెన్సీ' సినిమా ఎడిటింగ్ పూర్తయిందని, ఆ చిత్రాన్ని చూసిన తొలి వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ అని ఆమె తెలిపారు. 
 
'సినిమా చూస్తూ విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. సినిమా పూర్తయ్యాక 'నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అన్నారు. నా గురువు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఎమర్జెన్సీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌కు చేరుకుంది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని ఆ పోస్ట్‌లో కంగనా రనౌత్ పేర్కొన్నారు. 
 
విజయేంద్ర ప్రసాద్ గతంలో కథ అందించిన 'మణికర్ణిక' సినిమాలో కంగన ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది 'ఎమర్జెన్సీ'. భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

భార్య సోదరితో భర్త వివాహేతర సంబంధం: రోడ్డుపై భర్తపై దాడికి దిగిన భార్య (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షం

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments