Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెర్సల్ హిట్.. జక్కన్నకు కథ చెప్తున్న విజయేంద్రప్రసాద్. ఓకే అయితే?

దర్శకుడు, రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహాభారతం ఇప్పట్లే లేనట్టేనని తెలిపారు. తమిళంలో తన స్క్రీన్ ప్లే మెర్సల్ భారీ సక్సెస్ సాధించిన సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ర

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (12:24 IST)
దర్శకుడు, రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహాభారతం ఇప్పట్లే లేనట్టేనని తెలిపారు. తమిళంలో తన స్క్రీన్ ప్లే మెర్సల్ భారీ సక్సెస్ సాధించిన సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజమౌళికి ఓ కథను వినిపించి, ఒప్పించే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. జక్కన్న తన కథకు ఓకే చెబితే... ఆపై అందుకు సరిపడిన హీరోను ఎంపిక చేసే పని మొదలవుతుందని చెప్పుకొచ్చారు. 
 
బాలీవుడ్‌లో మూడు జీవిత కథలు రాస్తున్నానని తెలిపారు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'విక్రమార్కుడు' (హిందీలో రౌడీ రాథోడ్)కు సీక్వెల్ రాస్తున్నట్టు వెల్లడించారు. తాను విసుగు లేకుండా కథలు రాయగలనని, తనకు ఇదొక్క పనే తెలుసునని తెలిపారు.
 
బాలీవుడ్ క్రిష్‌ తీస్తున్న ''మణికర్ణిక''కు కథ ఇచ్చానని... అస్సాంలో ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఫైట్‌ చేసిన రచిత్‌ కుల్‌బౌహిత్‌ జీవితం ఆధారంగా కథ రాస్తున్నానని చెప్పారు. అలాగే, ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ గోల్‌ వాల్కర్‌గారి బయోపిక్‌ రాస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. దీంతో పాటు ‘నాయక్‌’ అనే హిందీ సినిమాకు సీక్వెల్‌ రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments