Webdunia - Bharat's app for daily news and videos

Install App

మస్కిలోడిస్ట్రఫీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ సహకారం అందిస్తాం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (16:46 IST)
మస్కిలోడిస్ట్రఫీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుండి తగిన విధంగా సహకారం అందించేందుకు కృషి చేస్తానని విజవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రేర్ డిసీజ్ డే సందర్భంగా సీతారాంపురంలోని ఐకాన్ పబ్లిక్ స్కూలులో అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. 
 
ఈ సందర్భంగా రాయల్ సర్వీస్ ట్రస్టు వారి నిర్వహణలో మస్కిలో డిస్ట్రఫీతో బాధపడుతున్న వారికి ఐదు వీల్ చైర్లు, రెండు పవర్ వీల్ చైర్లు, ఒక ట్రై స్కూటీ శాసన సభ్యులు మల్లాది విష్ణు చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు విష్ణు మాట్లాడుతూ, అవయవాలు అన్ని ఉండి కూడా జీవనం కొనసాగించడం కష్టతరమవుతున్న తరుణంలో నడవలేని స్థితిలో మస్కిలో డిస్ట్రఫీతో బాధపడుతున్న వారు చాలా ఇబ్బందులు పడతారన్నారు. 
 
నడవలేకుండా ఎప్పటికీ వీరు ఇంటికే పరిమితమవుతున్నారని ఈవ్యాధికి మందులేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అయితే మస్కిలో డిస్టఫీ వ్యాధి గ్రస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన విధంగా సహకారం, ప్రోత్సాహం అందే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాజిటివ్ గా ఉందని అందరి సమస్యలను పరిష్కరిస్తుందని తప్పకుండా ఈ వ్యాధి గ్రస్తులకు తన శక్తి మేరకు కృషి చేస్తానన్నారు. 
 
రాయల్ సర్వీసు ట్రస్టు చైర్మన్ పి.పుల్లయ్య మాట్లాడుతూ, తమ ట్రస్టు ఆధ్వర్యంలో గతంలో కూడా సేవా కార్యక్రమాలు చేశామని అయితే మస్కిలోడిస్ట్రఫీ వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు, స్కూటీ అందించామని భవిష్యత్తులో ఏమి అవసరమైనా చేయటానికి తమ ట్రస్టు ముందుంటుందన్నారు. 
 
అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎస్. శోభారాణి మాట్లాడుతూ మస్కిలో డిస్టఫీతో బాధపడేవారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3500 మంది దాకా ఉన్నారన్నారు. మస్కిలో డిస్ట్రఫీతో బాధపడేవారు బయటకు వెళ్లలేరని బతికినంతకాలం లాక్ డౌన్ అని ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే వ్యాధితో బాధపడేవారు జీవితాంతం సంతోషంగా ఉండేందుకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహం అందించాలన్నారు. 
 
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5 వేలు పెన్షన్ ఇస్తున్నారని, మందులకు చాలడం లేదని నెలకు రు.15 వేలు ఇవ్వాలని అన్నారు. అలాగే మస్కిలో డిస్టఫీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా కేర్ సెంటర్ ఏర్పాటుచేయడంతో పాటు వైద్య సేవల కోసం ప్రత్యేక హాసప్టల్, ఫిజియోథెరపీ సెంటర్ ను ఊడా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments