Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయశాంతిని అంతలా బతిమలాడటానికి కారణం అదే..?!

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (14:35 IST)
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతున్న మహేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఈ సినిమాలో విజయశాంతిని తీసుకోవడంపై స్పందించారు.
 
అలనాటి మేటి హీరోయిన్‌లలో ఒకరైన విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి హిట్‌లు సాధించి, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది. రాజకీయాలలో బిజీగా మారిన తర్వాత సినిమాలు చేయడం మానేసిన విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ముఖానికి రంగేసుకుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. 
 
అయితే ఈ సినిమా కంటే ముందు 'రాజా ది గ్రేట్‌' సినిమా కోసం విజయశాంతి గారిని కలిశాను. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' లైన్‌ అనుకున్నప్పుడే ఈ పాత్ర కోసం ఆవిడను అనుకుని కలబోతున్నానని మహేష్ బాబుకు చెప్పాను. 'మరో నటి ఎవ్వరు చేసినా కుదరదు.. వేరే వాళ్లు చేస్తే ఆ మ్యాజిక్ రాదు. సో ఆ మ్యాజిక్ మిస్ కాకూడదనే అంతలా బతిమిలాడాను' అని అనిల్ రావిపూడి అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments