Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు ఇదే

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (16:32 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సరికొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. "జనగణమన" (జేజీఎం) అనే టైటిల్‌తో ఈ సినిమా ఓపెనింగ్ మంగళవారం ప్రారంభమైంది. పూరీ కనెక్స్ట్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ముంబైలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాఫ్టర్‌లో రాగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉ్న ఆర్మీ కమాండ్ వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. 
 
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, తదితరులు పాల్గొన్నారు. నిజానికి 'జనగణమన' చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని భావించారు. కానీ, అది సాధ్యపడకపోవడంతో ఇపుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నారు.
 
ఈ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. వచ్చే యేడాది ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా

మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments