Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్ రెడ్డి' దూకుడుకి బ్రేకులు వేసిన "నోటా".. బ్యాడ్ టైమ్ ప్రారంభమైందా?

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (12:33 IST)
టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో కెరటంలా దూసుకొచ్చిన యువ హీరో.. "గీత గోవిందం" చిత్రంతో టాప్ స్టార్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నటించిన చిత్రం "నోటా". ఈ చిత్రం ఈనెల 5వ తేదీన విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆయనకు బ్యాడ్ టైమ్ ప్రారంభమైందనే టాక్ వినిపిస్తోంది.
 
వరుసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ దూసుకపోతున్న విజయ్‌కు 'నోటా' బ్రేక్ వేసిందన్న ప్రచారం సాగుతోంది. నిజానికి 'పెళ్లి చూపులు' సినిమాతో ఆకట్టుకున్న ఈ నటుడు "అర్జున్ రెడ్డి"తో యూత్‌లో ఒక ఐకాన్‌గా మారిపోయాడు. అనంతరం వచ్చిన "గీత‌ గోవిందం"తో అందరి వాడిగా మారిపోయాడు. ఇలా ఏ సినిమా చేసినా వైవిధ్యం కనబరుస్తూ అలరిస్తున్నాడు. ఇతర సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. 'ట్యాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో విజయ్ నటిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' శుక్రవారం రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం రూపొందింది. చిత్రం విడుదలకాకముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందడంతో అభిమానుల్లో ఉత్కంఠనెలకొంది. కానీ సినిమా రిలీజైన అనంతరం భిన్నమైన టాక్ వినిపిస్తోంది. చిత్రానికి ఎదురుగాలి వీస్తోందని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? పెడితే దానికి సంబంధించిన అంశం ఉండాలి కదా అని ప్రేక్ష‌కులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి విజయ్‌కు ఇప్పటి నుండి అసలైన టైం ప్రారంభమైందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments