Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ మూవీ టిక్కెట్ల కోసం పోట్లాడిన నేను ఈరోజు ఇలా.. విజయ్ దేవరకొండ

'ప్రిన్స్' మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "మహర్షి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. పూజా హెగ్డే చిత్రంలో

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:45 IST)
'ప్రిన్స్' మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "మహర్షి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. పూజా హెగ్డే చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు.

 
ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ఫోటోలు లీక్ కాగా, అవి ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు పెంచాయి. దిల్‌ రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా క‌నిపించ‌నున్నాడు. 
 
ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర సెట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లితో క‌లిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన విజ‌య్.. ఒక‌ప్పుడు మ‌హేష్ మూవీ టిక్కెట్స్ కోసం పోట్లాడిన నేను, సినిమా గురించి మ‌హేష్‌తో చ‌ర్చించడం చాలా ఆనందంగా ఉంద‌ని కామెంట్ పెట్టాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments