Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు నాగభూషణం సతీమణి సీత ఇకలేరు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (09:03 IST)
ప్రముఖ నటుడు నాగభూషణం సతీమణి సీత ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె సోమవారం హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 87 యేళ్లు. ఆమె అంత్యక్రియలు కూడా మహాప్రస్థానంలో సోమవారమే పూర్తి చేశారు. 
 
రక్తకన్నీరు నాటకం సమయంలో ప్రముఖ నటుడు నాగభూషణంతో అయిన పరిచయం పెళ్లికి దారితీసింది. 1956లో ఆయనను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె భువనేశ్వరి, కుమారుడు సురేందర్ ఉన్నారు.
 
కాగా, దిగ్గజ దర్శకుడు కేవీరెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆమె బాలనటిగా కనిపించారు. హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న సీత.. మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి తదితర సినిమాల్లో నటించారు.
 
2002లో చివరిసారి 'నేనేరా పోలీస్' అనే చిత్రంలో కనిపించారు. సుమారు 250 సినిమాల్లో నటించిన సీత.. 2 వేల వరకు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 'రుతురాగాలు' వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌లోనూ నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments