'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్‌కు అనుమతి నిరాకరణ.. మారిన వేదిక

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (17:23 IST)
హీరో బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతికి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ శుక్రవారం ప్రీరిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని చిత్ర నిర్మాతలు భావించారు. ఇందులోభాగంగా తొలుత ఒంగోలులోని ఏబీఎం కాలేజీ మైదానంలో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సాకుగా చూపి అక్కడ అనుమతి రద్దు చేశారు. దీంతో నిర్మాతలు మరో వేదికను ఎంపిక చేశారు. ఒంగోలు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌‌లో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 
 
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టరును రిలీజ్ చేశారు. ఒంగోలులోని ఈ ప్రదేశఁలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కాగా, ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు: బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఆ బస్సును అక్కడే వుంచండి, అపుడైనా బుద్ధి వస్తుందేమో?

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ముగ్గురు సోదరీమణులు

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

College student: కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments