Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్‌కు అనుమతి నిరాకరణ.. మారిన వేదిక

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (17:23 IST)
హీరో బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతికి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ శుక్రవారం ప్రీరిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని చిత్ర నిర్మాతలు భావించారు. ఇందులోభాగంగా తొలుత ఒంగోలులోని ఏబీఎం కాలేజీ మైదానంలో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సాకుగా చూపి అక్కడ అనుమతి రద్దు చేశారు. దీంతో నిర్మాతలు మరో వేదికను ఎంపిక చేశారు. ఒంగోలు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌‌లో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 
 
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టరును రిలీజ్ చేశారు. ఒంగోలులోని ఈ ప్రదేశఁలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కాగా, ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments