Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వీరసింహా రెడ్డి" నుంచి అప్‌డేట్.. 25న పస్ట్ సింగిల్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (19:54 IST)
హీరో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాటల్లో తొలి పాటను ఈ నెల 25వ తేదీన ఉదయం 10.29 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. 
 
"రాజసం నా ఇంటి పేరు'' అంటూ ఫస్ట్ సింగిల్ కొనసాగనుంది. ఇందులో విలన్‌గా దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments