Webdunia - Bharat's app for daily news and videos

Install App

హింసై అరసన్‌ వివాదం ముగిసినట్టేనా? శంకర్‌-వడివేలు మధ్య డీల్ ఓకే!

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (12:53 IST)
Vadivelu
'హింసై అరసన్‌ 24 ఆమ్‌ పులికేసి' చిత్రానికి సంబంధించిన వివాదం పరిష్కారమైనట్టేనని తెలుస్తోంది. దర్శకుడు శంకర్‌ హింసై అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి చిత్రం ద్వారా హాస్యనటుడు వడివేలును కథా నాయకుడిగా పరిచయం చేశారు. చిత్రం విజయవంతం కావడంతో అదే టీమ్‌తో హింసై అరసన్‌ 24 ఆమ్‌ పులికేసి సీక్వెల్‌ను నిర్మించాలని దర్శకుడు శంకర్‌ భావించారు.
 
షూటింగ్‌ కొంత భాగం పూర్తయిన తర్వాత కథలో మార్పులు చేశారంటూ నటుడు వడివేలు షూటింగ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో దర్శకుడు శంకర్‌కు వడివేలుకు మధ్య తలెత్తిన విభేదాలు నిర్మాతల మండలిలో ఫిర్యాదు వరకు వెళ్లాయి. వడివేలు కారణంగా తనకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని శంకర్‌ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వడివేలు నటనకు దూరమయ్యారు.
 
పలుమార్లు దర్శకుడు శంకర్, వడివేలు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. తాజాగా వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరి గణేష్‌ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. దర్శకుడు శంకర్‌కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు సమ్మతించినట్లు, త్వరలోనే హింసై అరసన్‌ 24 ఆమ్‌ పులికేసి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

కమల్ హాసన్‌కు షాకిచ్చిన కర్నాటక హైకోర్టు.. సారీ చెప్పడానికి అంత నామోషీనా?

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments