Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజ్ పురి సినీ పరిశ్రమలో దారుణం: నటీనటులపై దర్శకుడు యాసిడ్ దాడి!

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (18:14 IST)
సాధారణంగా ప్రేమోన్మాదులో లేకు వేరేదైనా కారణంగా యాసిడ్ దాడి జరుగుతుండటం వినేవుంటాం. అయితే ఓ సినీ దర్శకుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా మరో హీరోతో కలిసి నటిస్తుండటాన్ని సహించక నటీనటులపై యాసిడ్ దాడి చేసిన ఘటన భోజ్ పురిలో చోటుచేసుకుంది. భోజ్ పురి సినీ పరిశ్రమలో జరిగిన ఈ దారుణం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరు నటీనటులపై అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు యాసిడ్ దాడి చేశాడు. వారిద్దరూ షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజీ ప్రాంగణంలో నిద్రపోతుండగా ఈ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వెంటనే అజయ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడని ఏఎస్పీ గోస్వామి తెలిపారు.
 
ఈ యాసిడ్ దాడిలో గాయపడిన వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరిలో రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూపాలిపై కోపంతోనే అజయ్ ఈ పని చేశాడని సమాచారం. ఇక పారిపోయిన దర్శకుడు అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments